ఆంధ్రప్రదేశ్‌

తాళం వేసిన ఇంటిపై ఇక నిఘా నేత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుప్పం, జూలై 21: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రెండు రోజుల కుప్పంలో పర్యటనలో భాగంగా శుక్రవారం లాక్‌డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్‌ను ప్రారంభించారు. కుప్పంలోని సర్కిల్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఆయన లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్‌ను ప్రారంభించారు. కుప్పం సర్కిల్ పరిధిలోని కుప్పం పట్టణంలో ఎవరైనా ఇంటికి తాళాలు వేసి వేరొక ఊరుకు వెళ్లినప్పుడు వారి మొబైల్‌లో ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకొని ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందిస్తే ఆ ఇంటి వద్ద రాత్రి వేళల్లో నిఘా కెమెరా నుంచి భద్రత చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రయోగాత్మకంగా కుప్పంలో ప్రారంభించిన ఈ యాప్ విజయవంతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. అందరికీ అందుబాటులో ఈ యాప్‌ను తీసుకొచ్చేందుకు పోలీసు సిబ్బంది పట్టణంలోని ప్రతి ఇంటికి వెళ్లి వారి వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్‌లలో యాప్‌ను డౌన్‌లోడ్ చేసి తర్ఫీదు ఇస్తారని పేర్కొన్నారు.