ఆంధ్రప్రదేశ్‌

లోకేష్ చాంబర్ వద్ద మహిళ హంగామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 21: రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ చాంబర్ వద్ద ఒక మహిళ హంగామా సృష్టించింది. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో విజయవాడకు చెందిన గోవిందమ్మ తన ఇద్దరు కూతుళ్లతో మంత్రి చాంబర్ ప్రాంతానికి వచ్చి, కాసేపు అక్కడ విజిటర్లకు కేటాయించిన స్థలంలో కూర్చుని, ఆకస్మాత్తుగా పూనకం వచ్చినట్లుగా ఊగిపోతూ హడావుడి చేసింది. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆమెను బయటకు తీసుకువెళ్లినప్పటికీ, మళ్లీ వచ్చి హడావుడి చేసింది. తనకు ఇద్దరు ఆడపిల్లలని, వారు చర్మవ్యాధులతో బాధపడుతున్నారని ఆ మహిళ తెలిపింది. ప్రభుత్వం అందిస్తున్న సాయంతో ఆ వ్యాధి పూర్తిగా తగ్గడంలేదని, ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు వచ్చానని తెలిపింది. మంత్రిని కలిసేందుకు వస్తే తనను అడ్డుకుంటున్నారంటూ ఆరోపించింది. తన పిల్లలను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంది. కాగా ఈ విషయమై మంత్రి కార్యాలయ సిబ్బంది స్పందిస్తూ, గతంలో ఒక అమ్మాయికి సిఎంఆర్‌ఎఫ్ కింద లక్ష రూపాయలు మంజూరు చేశామని, ఇంకో అమ్మాయికి పింఛను ఇస్తున్నామని వివరించారు.

చిత్రం.. పిల్లలను ఆదుకోవాలని వేడుకుంటున్న మహిళ