ఆంధ్రప్రదేశ్‌

మన లోక్‌సభ స్పీకర్ షీలాదీక్షిత్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 21: అదేమిటి? సుమిత్రామహాజన్ స్థానంలో ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ ఎప్పుడు లోక్‌సభ స్పీకరయిందని కంగారు పడుతున్నారా? అబ్బే.. అదేమీలేదు! సుమిత్ర మహాజన్ నిక్షేపంగా అదే పదవిలో కొనసాగుతున్నారు. షీలాదీక్షిత్‌లో ఇంకా యుపి ఎన్నికల అవమానభారం తొలగిపోలేదు. మరి షీలాదీక్షిత్‌ను లోక్‌సభ స్పీకర్ ఎవరు నియమించారనుకుంటున్నారా? ఇంకెవరు.. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు! ఇంతకూ విషయమేమిటంటే.. అచ్చెన్నాయుడు సోదరుడైన కేంద్రమాజీ మంత్రి, దివంగత ఎర్రన్నాయుడు తనయుడు, శ్రీకాకుళం ఎంపి రామ్మోహన్‌నాయుడు మ్యారేజ్ రిసెప్షన్ వేడుక న్యూఢిల్లీలో ఈనెల 19న ఘనంగా జరిగింది. దానికి ప్రధాని మోదీతోపాటు కేంద్రమంత్రులు కూడా హాజరయి, వధూవరులను ఆశీర్వదించారు. ఆ సందర్భంలో రామ్మోహన్ దంపతులు మోదీకి పాదాభివందనం చేసి ఆయన ఆశీస్సులు కూడా పొందారు. అయితే.. రామ్మోహన్ రిసెప్షన్ వేడుకకు లోక్‌సభ స్పీకర్ షీలాదీక్షిత్ కూడా హాజరయ్యాయని అచ్చెన్నాయుడు తన ఫేస్‌బుక్ అకౌంటులో పెట్టిన కామెంట్ ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్ అవుతోంది.