ఆంధ్రప్రదేశ్‌

జర్నలిస్టులకు ట్రిపుల్ బెడ్‌రూం ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, జూలై 22: రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ మూడు పడకల గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో శనివారం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం గురించి కొంతమంది తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ప్రతి జర్నలిస్టుకు మూడు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని నంద్యాల నుంచే ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అంతకుముందు నంద్యాలకు చేరుకున్న సిఎంకు ఎపిజెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వంశీకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు కృపవరం, రామకృష్ణ, హరినాథరెడ్డి, ప్రభాకర్‌చౌదరి, శ్రీను, ఎస్‌ఆర్ షరీఫ్, మహేశ్వరరావు తదితరులు వినతిపత్రం అందజేశారు. కాగా తమ డిమాండ్‌కు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రికి ఎపిజెఎఫ్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.