ఆంధ్రప్రదేశ్‌

ఆరు నెలల కుమార్తెను చంపి తల్లి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినుకొండరూరల్, జూలై 22: గుంటూరు జిల్లా వినుకొండ మండలంలోని గోకనకొండ గ్రామంలో వివాహిత కొండి వరలక్ష్మి (22) శనివారం రాత్రి తన 6 నెలల కుమార్తె శర్మిషను నీటితొట్టిలో వేసి చంపి, అనంతరం తాను కూడా ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలనేపథ్యంలో పాపను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. భర్త అంకారావు వేధింపులు తాళలేకే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది. అయతే అల్లుడే తన కుమార్తెను, మనవరాలని చంపేశాడని మృతురాలి తండ్రి చిన వెంకటనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.