ఆంధ్రప్రదేశ్‌

విమాన మ్యూజియానికి మరో విడత నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 28: విశాఖలో ఏర్పాటు చేయనున్న టియు-142 విమానాన్ని మ్యూజియంగా మార్చేందుకు వీలుగా మరో విడత నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విమానాన్ని వీలైనంత త్వరగా మ్యూజియంగా మార్చేందుకు 5 కోట్ల రూపాయలకు పాలనాపరమైన అనుమతి మంజూరు చేసింది. తొలివిడతగా 1.25 కోట్ల రూపాయలను విడుదల చేయగా, మరో విడత 1.25 కోట్ల రూపాయలను విశాఖ నగరాభివృద్ధి సంస్థకు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే బేస్ పెడస్టల్స్ నిర్మాణానికి, విమానాన్ని భాగాలుగా విడదీసి, తిరిగి అసెంబ్లింగ్ చేసేందుకు, ఫ్లాట్‌ఫారం నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఎకరం స్థలంలో బీచ్ రోడ్డులో ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించడం తెలిసిందే.