ఆంధ్రప్రదేశ్
70వేల రూపాయి నాణేలు..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 15 August 2017
అమలాపురం, ఆగస్టు 14: దేశానికి స్వాతంత్య్రం లభించి 70 వసంతాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో సోమవారం 70వేల రూపాయి నాణేలతో 70 అడుగుల భారతదేశ పటాన్ని రూపొందించారు. అమలాపురానికి చెందిన ఎస్బిఐ సీనియర్ అసిస్టెంట్ ఇవటూరి రవిసుబ్రహ్మణ్యం స్థానిక సివి రామన్ పాఠశాల ఆవరణలో తాను సేకరించన 70వేల రూపాయి నాణేలతో ఈ అరుదైన కళాఖండాన్ని రూపొందించారు. డ్రాయింగ్ ఉపాధ్యాయులు మంగిపూడి శ్రీనివాస్, భాస్కర్, ప్రసాద్లు ఆయనకు సహకరించారు. నాణేలతో అతిపెద్ద పటాన్ని రూపొందించిన సుబ్రహ్మణ్యంను పలువురు అభినందించారు.