ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో మెడికో మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కాకినాడ సిటీ, మే 16: తూర్పు గోదావరి జిల్లా రంగంపేట సమీపంలో సోమవారం మధ్యాహ్నం బైక్ చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఒక పిజి వైద్య విద్యార్థి మృతిచెందాడు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం జిల్లా కేంద్రం అలకనంద వీధికి చెందిన వి సంజయ్(28), హైదరాబాద్ మలక్పేటకు చెందిన ఎండి ఇమ్రాన్(28) ఏలూరులోని ఆశ్రం ఆసుపత్రిలో పిజి వైద్య విద్యార్ధులుగా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం తమ ద్విచక్ర వాహనంపై ఏలూరు నుండి రాజమండ్రి మీదుగా కాకినాడ బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం రంగంపేట సమీపంలో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వీరిద్దరినీకాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో సంజయ్ మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన ఇమ్రాన్ కాకినాడ ప్రభుత్వాసుపత్రి ఐసియులో వైద్యులు చికిత్స అందజేస్తున్నారు.