ఆంధ్రప్రదేశ్‌

పులివెందులకు దీటుగా నంద్యాల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఆగస్టు 18: నంద్యాల అభివృద్ధి గురించి ఎవరూ భయపడవద్దని, పులివెందులను ఏవిధంగా అభివృద్ధి చేస్తున్నామో అలాగే నంద్యాలను కూడా అభివృద్ధి చేస్తానని వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో న్యాయానికి, ఓటువేయండి, ధర్మాన్ని గెలిపించండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని సాయిబాబానగర్, దేవనగర్, విసి కాలనీలో జగన్ రోడ్‌షో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడున్నరేళ్లలో చంద్రబాబు దుర్మార్గ పాలనను మనం అనుభవించామన్నారు. రైతులకు రూ.86 వేల కోట్ల రుణం మాఫీ చేస్తానని, ఆడపడచులకు రూ.14 వేల కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, జాబు ఇస్తానని నిరుద్యోగులను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసుకుని నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్న పాపం బాబుదేనన్నారు. మూడున్నరేళ్లపాటు ప్రజాధనాన్ని కొల్లగొట్టిన చంద్రబాబు ఆ డబ్బుతో వైకాపా ఎమ్మెల్యేలను కొన్నారని, ఇప్పుడు నంద్యాలలో ప్రజలను కూడా కొనాలనుకుంటున్నారని విమర్శించారు. నంద్యాలకు టిడిపి దయ్యాలు వస్తాయి, ఒక్కొక్క ఓటరు చేతిలో రూ.5 వేలు పెట్టి ప్రమాణాలు చేయిస్తాయి. మీరంతా జాగ్రత్తగా ఉండాలి, ధర్మానికి ఓటేసి దయ్యాలను పారదోలాలని పిలుపునిచ్చారు. నంద్యాల అభివృద్ధిని నా బాధ్యతగా తీసుకుని పనిచేస్తానని జగన్ అన్నారు. గడచిన మూడున్నరేళ్లలో చంద్రబాబు గానీ ఆయన మంత్రులు గానీ ఒక్కసారంటే ఒక్కసారైనా నంద్యాలకు వచ్చారా అని ప్రశ్నించారు. వైకాపా అభ్యిర్థి శిల్పామోహన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

చిత్రం..నంద్యాల రోడ్ షోలో ప్రసంగిస్తున్న జగన్