ఆంధ్రప్రదేశ్‌

కాలువలో పడి ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేగిడి, ఆగస్టు 20: శ్రీకాకుళం జిల్లా, రేగిడి మండలం ఉణుకూరు పంచాయతీ పోరాం గ్రామ సమీపంలో ఉన్న మడ్డువలస ప్రధాన కాలువలో ఆదివారం స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. రాజాంకు చెందిన దుప్పాడ రోహిత్‌నాయుడు(18), దాసరి రామరాజు(18) పోరం గ్రామంలో తన స్నేహితుడి ఇంటికి వెళ్లి, అక్కడ నుంచి మరో ముగ్గురితో కలిసి కాలువలో స్నానానికి ఐదుగురు దిగారు. రోహిత్‌నాయుడు, దాసరి రామరాజులకు ఈత రాకపోవడంతో నీరుతాగి నీటిలో మునిగిపోయారు. కొద్దిసేపటి తర్వాత గ్రామస్తులు చూసి ఒడ్డుకు చేర్చగా అప్పటికే చనిపోయారు. రేగిడి పోలీసులకు కూడా సమాచారం ఇవ్వగా ఎస్‌ఐ భాస్కరరావు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టమ్ నిమిత్తం రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.