ఆంధ్రప్రదేశ్‌

వైసిపికి ఓటేస్తే అరాచకానికి వేసినట్టే: యనమల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 21: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్వస్థలం ఇడుపులపాయలోని బంకర్లను తవ్వితే వేల కోట్ల అవినీతి సొమ్ము బయటపడుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ఇడుపులపాయలోని బంకర్లలో జగన్ దాచిన అవినీతి సొమ్మును అధికారులు వెలికితీయాలని, లేదంటే తమను వెళ్ళి బంకర్లు తెరవమంటే తెరిచి చూపిస్తామన్నారు. కాకినాడ టిడిపి కార్యాలయంలో సోమవారం యనమల విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తాము ప్రతిపక్షంలో ఉండగానే జగన్ అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టామన్నారు. సాక్షి ఛానల్, పేపర్ ఉండగా, తనకు సొంత మీడియా లేదని జగన్ పచ్చి అబద్ధాలాడుతున్నారు. తన పత్రిక, ఛానెళ్ల ద్వారా ఉద్యోగుల్లో అభద్రతాభావం కల్పించడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. 11 ఛార్జిషీట్లు కలిగిన జగన్ జైలుకు వెళ్ళక తప్పదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇమేజ్‌ను దెబ్బతీయడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని, రాష్ట్ర సంక్షేమం ఆయనకు అవసరం లేదన్నారు. నంద్యాలలోవైసిపికి ఓటేస్తే అరాచకానికి వేసినటే ఆయన చెప్పారు.