ఆంధ్రప్రదేశ్‌

ఇద్దరు అధికారులపై టిడిపి ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 21: నంద్యాల శాసనసభా నియోజకవర్గం ఉప ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రధాన విధులు నిర్వహిస్తున్న వారు తమను ఏ మాత్రం ఖాతరు చేయకుండా వైకాపాకు మద్దతుగా పనిచేశారని పేర్కొన్నట్లు సమాచారం. ఆ అధికారులు కీలక బాధ్యతల్లో ఉండటం వల్ల ప్రచార సమయంలో తాము ఇబ్బందులు పడ్డామని, అయితే పోలింగ్, కౌంటింగ్ సమయంలో వారి నుంచి ఎదురయ్యే ఇబ్బందులేమీ లేకపోవడం వల్ల ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయలేదని అన్నట్లు తెలుస్తోంది.