ఆంధ్రప్రదేశ్‌

నిలకడగా వరద గోదావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 21: వరద గోదావరి కాటన్ బ్యారేజి ఎగువ నిలకడగా వుంటే బ్యారేజి దిగువకు వద్ద గత 24 గంటల నుంచి వరదనీటి ప్రవాహం ఉద్ధృతిగా సాగుతోంది. కాటన్ బ్యారేజి వద్ద వరద నీటి మట్టం సోమవారం 10.10 అడుగుల స్థాయిలో ఉద్ధృతి కొనసాగుతోంది. బ్యారేజీ 175 గేట్లను ధవళేశ్వరం, విజ్జేశ్వరం ఆర్మ్‌లలో 0.5 మీటర్లు, ర్యాలీ, మద్దూరు ఆర్మ్‌లలో 0.6 మీటర్ల మేర ఎత్తి వేసి వరద జలాలను సముద్రంలోకి వదిలారు. ఎగువ ప్రాంతంలోని భద్రాచలం వద్ద మధ్యాహ్నం 22.05 అడుగుల నీటి మట్టం నమోదు కాగా ధవళేశ్వరం బ్యారేజి వద్ద 13.75 మీటర్ల జలాశయ మట్టాన్ని నిర్వహిస్తూ మిగిలిన వరద జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈస్ట్రన్ డెల్టాకు 4500 క్యూసెక్కులు, సెంట్రల్ డెల్టాకు 1900, వెస్ట్రన్ డెల్టాకు 4000 క్యూసెక్కును సాగునీటి నిమిత్తం విడుదల చేశారు. అఖండ గోదావరి ఎగువ ప్రాంతంలో కాళేశ్వరం వద్ద 4.10 మీటర్లు, పేరూరు వద్ద 6.80 మీటర్లు, దుమ్ముగూడెం వద్ద 7.36, కూనవరం 8.73, కుంట 7.26, కొయిదా 11.06, పోలవరం 8.16 మీటర్ల నీటి మట్టం నిలకడగా కొనసాగుతోంది.