ఆంధ్రప్రదేశ్‌

పివిఆర్‌కె మృతికి కోడెల సంతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 22: సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివిఆర్‌కె ప్రసాద్ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తీవ్ర సంతాపం తెలియజేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హయాంలో నూతన పరిపాలన సంస్కరణలకు శ్రీకారం చుట్టి ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసిన ఘనత పివిఆర్‌కె ప్రసాద్‌కే దక్కిందంటూ స్పీకర్ గుర్తు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య సలహాదారునిగా కూడా ఆయన ఎంతో సేవ చేశారని పేర్కొన్నారు. ప్రసాద్ తనకు ఆత్మీయుడని, ఆయన మరణం తెలుగుజాతికి, తనకు, తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని స్పీకర్ పేర్కొన్నారు. ఆయన తెలుగు సాహితీ ప్రపంచానికి కూడా ఎంతో సేవ చేశారని కొనియాడారు.