ఆంధ్రప్రదేశ్‌

అవినీతి నిర్మూలనలో విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 22: రాష్ట్రంలో అవినీతికి అడ్డుకట్ట వేయటంలో ప్రభుత్వం విఫలమైందని శాసనసభలో బిజెపి ఫ్లోర్‌లీడర్ విష్ణుకుమార్ రాజు విమర్శించారు. మంగళవారం గుంటూరులో కేంద్రమంత్రి జెపి నద్దా హాజరైన సంకల్పసిద్ధి- నవభారత నిర్మాణం సదస్సులో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో తమ ప్రభుత్వానికి అవినీతి మరక లేదన్నారు. విశాఖ భూముల స్కాముపై తమ ఒత్తిడి మేరకే రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించిందని తెలిపారు. ఈ వ్యవహారంపై విశాఖ నగర పరిధి లోనే మూడువేల వరకు ఫిర్యాదులు అందాయన్నారు. అచ్యుతాపురం తహశీల్దారుతో పాటు ఉన్నతాధికారి అవినీతిపై తానే స్వయంగా ఏసిబికి ఫిర్యాదు చేశామన్నారు. 2019 ఎన్నికలే బిజెపి టార్గెట్‌గా చెప్పారు. ఏపి అవినీతి రహిత రాష్ట్రంగా రూపు దిద్దుకోవాలనే ఆకాంక్ష వ్యక్తంచేశారు.