ఆంధ్రప్రదేశ్‌

ఆకతాయిల వేధింపులతో రైల్లోంచి దూకేసిన యువతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగరాయకొండ, ఆగస్టు 31: కేరళ నుంచి ఢిల్లీ వెళుతున్న నిజాముద్దీన్ మిలీనియం ఎక్స్‌ప్రెస్ నుంచి ఓ యువతి దూకి గాయాలు పాలైన సంఘటన గురువారం మధ్యాహ్నం సింగరాయకొండ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే ఎస్‌ఐ రవణయ్య కథనం ప్రకారం విజయవాడకు చెందిన ముగ్గురు యువతులు చెన్నైలో సాప్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. బక్రీద్ పండుగకు గురువారం వారు చెన్నై నుంచి మిలీనియం ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడకు బయలుదేరారు. అదే ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఉత్తరాదికి చెందిన యువకులు వీరిని ర్యాగింగ్ చేయడంతో తీవ్ర మనస్తాపానికి లోనైయ్యారు. రైలు సింగరాయకొండ రైల్వేస్టేషన్‌లో నిలుపుదల లేనందున నెమ్మదిగా ప్రయాణిస్తుండగా షేక్ అజ్మల్ అనే యువతి తీవ్ర మనస్థాపానికి లోనై రైలులో నుంచి దూకేసింది. వెంటనే వారి స్నేహితులు రైలు చైన్ లాగి ట్రైన్‌ను ఆపారు. గాయాలు పాలైన అజ్మల్‌ను రైల్వే సిబ్బంది 108 సహాయంతో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు రైల్వే ఎస్‌ఐ తెలిపారు.

చిత్రం..రిమ్స్‌లో చికిత్స పొందుతున్న షేక్ అజ్మల్