ఆంధ్రప్రదేశ్‌

టిడిపితోనే కాపులకు మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 31: కాపులకు తెలుగుదేశం ప్రభుత్వమే న్యాయం చేస్తుందని, బీసీల్లో చేర్చేందుకు మేనిఫేస్టో హామీ మేరకు కచ్చితంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని, ఈలోగా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అన్నివిధాలా చర్యలు చేపట్టామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు. అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని, ఆయన కృషిని ప్రజలు ఆశీర్వదిస్తున్నారన్నారు. రాజమహేంద్రవరంలో గురువారం ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన చిన రాజప్ప మీడియాతో మాట్లాడారు. నంద్యాలలో తెలుగుదేశం పార్టీ విజయంతో వైసిపి అధినేత జగన్ బోర్లాపడ్డారని, కాకినాడ కార్పొరేషన్‌లోనూ అత్యధిక సీట్లతో మేయర్ పీఠాన్ని టిడిపి కైవసం చేసుకోనుందన్నారు. కాపులను బీసీల్లోకి చేర్చుతామని, మంజునాథ్ కమిషన్ నివేదిక వచ్చిన వెంటనే కేంద్రానికి పంపిస్తామన్నారు. వైసిపి అధినేత జగన్ అండదండలతోనే ముద్రగడ ఉద్యమం చేస్తున్నారని ఆరోపించారు. కాపులకు న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి కంకణబద్ధులై ఉన్నారన్నారు. కాపులను బీసీల్లో చేర్చడంతోపాటు ఆర్థికంగా ఎదుగుదల సాధించడానికి చంద్రబాబునాయుడు కృషిచేస్తున్నారన్నారు.