ఆంధ్రప్రదేశ్‌

మరో 24 గంటలు వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 31: నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో మరో 24 గంటల పాటు ఒక మోస్తరు వర్షాలు కురియనున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు పేర్కొన్నారు. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. కాగా, బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకూ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయి. విజయనగరం జిల్లా ఎస్‌కోటలో10 సెంటీ మీటర్లు, వేపాడలో తొమ్మిది సెంటీమీటర్లు, కొమరాడలో ఏడు సెంటీ మీటర్లు, విశాఖలో ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే చిత్తూరులో కూడా 10 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఉరుములు, పిడుగులతో కుండపోత వర్షం కురిసింది. ఈ సీజన్‌లో ఇంత భారీ వర్షం కురియడం ఇదే ప్రథమమని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.