ఆంధ్రప్రదేశ్‌

అగ్రిగోల్డు బాధితులకు సత్వర న్యాయం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 19: అగ్రిగోల్డు సంస్థలో స్వల్ప మొత్తాల్లో పెట్టుబడులు పెట్టిన, పేద, మధ్యతరగతి వర్గాలకు సత్వర న్యాయం లభించేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసు ఉన్నతాధికార్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి తన నివాసంలో గురువారం అగ్రిగోల్డు కేసు పురోగతిపై ఉన్నతాధికార్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌తో బాటు ఇతర రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది రూ.3,965 కోట్ల మేర అగ్రిగోల్డ్ సంస్థలో పెట్టుబడులు పెట్టారన్నారు. ఇందులో రూ.10 వేల లోపు పెట్టుబడులు పెట్టిన వారు 7 లక్షల 94 వేల మంది వున్నారని, వీరందరి పెట్టుబడి రూ.363 కోట్ల మేర వుందన్నారు. అదేవిధంగా రూ.20 వేల లోపు పెట్టుబడులు పెట్టిన వారు 13 లక్షల 80 వేల మంది వున్నారన్నారు. వీరు రూ.1180 కోట్ల మేర అగ్రిగోల్డు సంస్థలో తమ కష్టార్జితాన్ని దాచుకున్నారన్నారు.