ఆంధ్రప్రదేశ్
కెకె లైన్లో జారిపడిన కొండచరియలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 20 May 2016
అనంతగిరి, మే 19: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొత్తవలస-కిరండోలు రైల్వే మార్గంలో కొండ చరియలు జారిపడి గురువారం గూడ్స్ రైలు మూడు ఇంజన్లు, ఒక వ్యాగన్ దెబ్బతిన్నాయి. బుధవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కిరండోలు-కొత్తవలస రైల్వే మార్గంలో కిముడుపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో 65వ నెంబర్ వద్ద భారీ కొండ చరియలు విరిగిపడ్డాయి. కిరండోలు నుంచి విశాఖపట్నం ఐరెన్ ఓర్ లోడుతో వెళుతున్న గూడ్స్ రైలు కొండ చరియలను ఢీకొట్టడంతో మూడు ఇంజన్లు, ఒక బోగి బోల్తా కొట్టాయి. దీంతో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి.