ఆంధ్రప్రదేశ్‌

అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 19: ‘రోను’ తుపాను ప్రభావంతో వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఈదురుగాలుల ఉద్ధృతికి జనజీవనం అస్తవ్యస్తం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాస గృహం నుంచి బుధవారం ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్, తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లతో, ఇతర ఉన్నతాధికార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పడిపోయిన చెట్లను తొలగించి ట్రాఫిక్‌కు అవరోధం లేకుండా చేయాలని, కూలిన విద్యుత్ స్తంభాలను వెంటనే నిలబెట్టి విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని కోరారు. అవసరమైన ప్రాంతాలలో పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి భోజనం, మంచినీరు అందించాలని ఆదేశించారు. అధికార యంత్రాంగాన్ని కలెక్టర్లు అప్రమత్తం చేయాలని, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో, తుపాను తీవ్రత, ధోరణులు ఎలా మారుతున్నాయో ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలించి సహాయ, పునరావాస చర్యలను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. మంగళవారం నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలలో వర్షం పడగా గురువారం కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్న విషయం ప్రస్తావించారు. అన్ని మండలాలలో ప్రత్యేక అధికారులను నియమించి ఎప్పటికప్పుడు తుపాను ఉద్ధృతిని బట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అగ్నిమాపక సిబ్బంది, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లపై పనిచేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
కరవుపై టెలీకాన్ఫరెన్స్
నవ్యాంధ్రప్రదేశ్‌కు వారసత్వంగా సంక్షోభాలు సంక్రమించాయని, సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకునే పరిస్థితుల్లో మనం ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో అన్నారు. జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ హుద్ హుద్ తుపాను సంక్షోభాన్ని అదేవిధంగా అధిగమించాం. ఏడాది కాలంలోనే విశాఖపట్టణాన్ని ప్రపంచపటంలో పెట్టాం. నీరు-ప్రగతి చేపట్టి కరవురహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను చేస్తున్నాం’ అని సిఎం వివరించారు. రాష్ట్రాన్ని ఐదేళ్లలోపు కరవురహితంగా చేయాలనేది లక్ష్యం కాగా అంతకన్నా ముందే రాష్ట్రాన్ని సుసంపన్నం చేసేందుకు అధికార యంత్రాంగం శ్రద్ధపెట్టాలని కోరారు. భారీ వర్షాల వల్ల మట్టి మెత్తపడింది కాబట్టి పంటకుంటలు, ఇంకుడు గుంతల తవ్వకం ముమ్మరం చేయాలని, గత ఏడాది మే నెల కన్నా భూగర్భజలాలు రాష్టవ్య్రాప్తంగా 1.22 మీటర్లు మెరిగాయని సిఎం తెలిపారు. ఇందువల్ల 110 టిఎంసిల భూగర్భజలాలు అందుబాటులోకి రానున్నాయన్నారు. చిత్తూరు జిల్లాలో గత ఏడాది ఇదే సమయానికి భూగర్భజలాలు 30 మీటర్ల లోతులో ఉంటే ఈ ఏడాది 13 మీటర్ల లోతుకు వచ్చాయని, జలమట్టం 17 మీటర్లు పెరిగిందని, కడపలో 8.7 మీటర్లు పెరిగిందని, నెల్లూరు, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాలో గత ఏడాది కన్నా భూగర్భ జలమట్టాలు పెరిగాయని సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన జిల్లాలలో తగ్గడం పట్ల సిఎం ఆందోళన వ్యక్తం చేశారు.