ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి టౌన్, మే 19: అనంతపురం జిల్లా కదిరి రూరల్ మండలం పట్నం గ్రామ సమీపంలో అనంతపురం-చెన్నై 205 జాతీయ రహదారిపై గురువారం ఆర్టీసీ బస్సును కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ప్రమాదానికి సంబంధించిన వివరాలు.. కడప జిల్లా గుండుపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులునాయుడు కుటుంబంతో పాటు కొనే్నళ్ల క్రితం కర్ణాటకలోని బళ్లారికి మకాం మార్చారు. అయితే గుండుపల్లిలో ఆంజనేయస్వామి జాతర జరుగుతుండడంతో కుమారుడు రామయ్యనాయుడు, కోడలు సునీత, మనవరాలు యసితసాయితో పాటు కళ్యాణదుర్గంలో వుంటున్న చెల్లెలు స్వరూపతో కలిసి స్వగ్రామానికి కారులో బయల్దేరారు. పట్నం సమీపంలోకి రాగానే వీరి కారు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ సంఘటనలో ఆంజనేయులునాయుడు(60), రామయ్యనాయుడు(40), స్వరూప(47), యసితసాయి(14) అక్కడిక్కడే మృతి చెందారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సునీతను బెంగళూరుకు తరలించారు.

చిత్రం ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు, రోడ్డుపై మృతదేహాలు