ఆంధ్రప్రదేశ్‌

గౌరవం దక్కే పార్టీలో చేరతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, సెప్టెంబర్ 5: గౌరవం దక్కే పార్టీలో చేరతానని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక సీమ కోసం తాను చేసిన ఉద్యమాన్ని ప్రజలు సమర్ధించలేదన్నారు. అందుకే పార్టీని మూసివేస్తున్నానన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకు మరో పార్టీలో చేరతానన్నారు. మంగళవారం కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో ఏర్పాటుచేసిన కార్యకర్తలు, అభిమానుల సమావేశంలో బైరెడ్డి మాట్లాడుతూ విభజన తప్పదని తాను ముందుగానే హెచ్చరించినా ఎవరూ రాయలసీమ గురించి ఆలోచించలేదన్నారు. విభజన వల్ల సీమకు అన్యాయం జరుగుతుందనే ఏడేళ్ల క్రితం రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీని స్థాపించానన్నారు. ప్రజల మనసుల్లో లేని సీమ ఉద్యమం కోసం తానొక్కడినే ఉద్యమించినా ఫలితం లేకపోవడంతో ఇక చేసేది లేక ఆర్‌పిఎస్‌ను మూసివేస్తున్నానని అన్నారు.