ఆంధ్రప్రదేశ్
15 మంది అధికారులపై విచారణకు కమిటీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 6 September 2017
విజయవాడ, సెప్టెంబర్ 5: రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 13 మంది అధికారులు, రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన ఇద్దరు అధికారులపై వచ్చిన అరోపణలను విచారించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని తాజాగా నియమించింది. గతంలో ఏర్పాటు చేసిన కమిటీ స్థానంలో ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజ్ పాణిగ్రాహి విచారణాధికారిగా వ్యవహరిస్తారు. నెల్లూరు జిల్లా గృహ నిర్మాణ శాఖ పిడి రామచంద్రా రెడ్డి ప్రెజెంటింగ్ ఆఫీసర్గా కొనసాగుతారు.