ఆంధ్రప్రదేశ్
నేడు సీమలో సిఎం పర్యటన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 8 September 2017
అనంతపురం, సెప్టెంబర్ 7: ముఖ్యమంత్రి చంద్రమాబు నాయుడు శుక్రవారం రాయలసీమలో పర్యటించనున్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో జరిగే జలసిరికి హారతి కార్యక్రమాల్లో బాబు పాల్గొంటారు. రాజధాని నుంచి కర్నూలు జిల్లా ముచ్చుమర్రికి చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ కృష్ణమ్మకు హారతి ఇస్తారు. అనంతరం ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మోటార్లను ప్రారంభించి కె సి కెనాల్కు నీటిని విడుదల చేస్తారు. రైతులతో ముఖాముఖి, బహిరంగ సభలో సిఎం పాల్గొంటారు. తదంనతరం అక్కడినుంచి అనంతపురం జిల్లా ఉరవకొండకు చేరుకుంటారు. అక్కడ ఇంద్రావతి అక్విడెక్ట్ వద్ద తుంగభద్ర జలాశయం నుంచి హెచ్ఎల్సి విడుదల చేసిన తుంగభద్ర జలాలకు హారతి ఇస్తారు. అనంతరం అక్కడ జరిగే సభలో ప్రసంగిస్తారు.