ఆంధ్రప్రదేశ్‌

ప్రజల సొమ్ము దోచుకుని టిడిపి రాజకీయాలు:పెద్దిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: వైకాపా నేతలు డబ్బు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని, తెలంగాణలోని ప్రాజెక్టుల కాంట్రాక్టర్లుగా వైకాపా నేతలు ఉన్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన ఆరోపణలు విచారకరమని వైకాపా సీనియర్ నేత, శాసనసభాపక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నవయుగ సంస్ధ కాంట్రాక్టులు చేస్తుందనే విషయం ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుసన్నారు. తమ కుటుంబ సభ్యులు కుప్పం నియోజకవర్గంలో కూడా రోడ్ల పనులు చేశామన్నారు. విదేశాల్లో కూడా కాంట్రాక్టులు చేస్తున్నామన్నారు. రంగారెడ్డి-పాలమూరు ఎత్తిపోతల స్కీం కాంట్రాక్టులు వైకాపా నేతలకే దక్కాయని మంత్రి దేవినేని ఇష్టం వచ్చినట్లు నోరుపారేసుకోవడం తగదన్నారు. రాజకీయాల్లోకి డబ్బు సంపాదించేందుకు తాము రాలేదన్నారు. కర్నూలులో వైకాపా అధినేత జగన్ జలదీక్ష రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశారన్నారు. జగన్‌పాపులారిటీని చూసి ఓర్వలేక మంత్రి దేవినేని తమ పార్టీపై ఇష్టం వచ్చినట్లు నోరుపారేసుకున్నారన్నారు. ప్రజల సొమ్ము దోచుకుని రాజకీయాలు చేయడం టిడిపి నేతలకు అలవాటన్నారు.