ఆంధ్రప్రదేశ్‌

కన్న పిల్లలను కడతేర్చిన తల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామకుప్పం, సెప్టెంబర్ 8: క్షణికావేశం ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. నవ మాసాలు మోసి బిడ్డలకు జన్మనిచ్చిన తల్లే ఈ దారుణానికి ఒడికట్టింది. అభం శుభం తెలియని చిన్నారులను కన్న తల్లే ఉరివేసి చంపిన విషాద సంఘటన రామకుప్పం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు మండల పరిధిలోని కవ్వంపల్లి గ్రామానికి చెందిన వేమారెడ్డి, పవిత్రలకు దినేష్‌రెడ్డి(5), వృతిక్‌రెడ్డి(3) జన్మించారు. అయితే గత కొంత కాలంగా భార్య భర్తల మధ్య వివాదం చోటుచేసుకుంటుండేది. ఈ నేపథ్యంలో ఇటీవల గ్రామస్తులు ఇరువురి మధ్య రాజీ కుదిర్చారు. అప్పటి నుంచి కవ్వంపల్లిలో నివాసం ఉంటున్నారు. అయితే శుక్రవారం ఇంటిలో ఎవరు లేని సమయంలో పవిత్ర తన బిడ్డలు నిద్రిస్తుండగా తాడుతో ఉరివేసి చంపేసిన అనంతరం పారిపోయింది.