ఆంధ్రప్రదేశ్‌

సింహాచలంలో ప్రకృతి చికిత్సాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, సెప్టెంబర్ 8: సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానంలో ప్రకృతి చికిత్సాలయం ఏర్పాటు చేయాడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బెంగళూరుకు చెందిన వివేకానంద యోగ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ చొక్కలింగం శుక్రవారం సింహగిరికి వచ్చి దేస్థానం ఈవో రామచంద్రమోహన్‌తో ఈ మేరకు చర్చలు జరిపారు. సింహగిరిపై అనువుగా ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేసి ప్రకృతి చికిత్సాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ చొక్కలింగం విలేఖరులతో మాట్లాడుతూ బెంగళూరులోని వివేకానంద యోగ విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే పూర్తి స్థాయి సదుపాయాలు కలిగిన ఏకైక యోగ విశ్వవిద్యాలయమని, ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకల్పించారన్నారు. సుమారు కోటి రూపాయల వ్యయం కాగల ఈ ప్రాజెక్టుపై ఈవో కూడా సానుకూలంగా స్పందించారన్నారు.