ఆంధ్రప్రదేశ్
తెలుగు విద్యార్థులకు రక్షణ కల్పించండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 9 September 2017
మడకశిర, సెప్టెంబర్ 9: కర్నాటక రాజధాని బెంగళూరులో ఉద్యోగ పరీక్షలు రాయడానికి వెళ్లిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులపై కన్నడ సంఘాలు దాడికి పాల్పడటం బాధాకరమని, విద్యార్థులకు రక్షణ కల్పించాలని కర్నాటక హోంమంత్రి రామలింగారెడ్డికి పిసిసి చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి సూచించారు. విద్యార్థులపై దాడి జరిగినట్లు తెలియగానే ఆయన మంత్రి రామలింగారెడ్డికి ఫోన్ చేశారు. కర్నాటకలో జరిగే ఆర్ఆర్బి, ఐపిపిఎస్ ఉద్యోగాల కోసం తెలుగురాష్ట్రాల నుంచి చాలా మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని, ఇందుకు సంబంధించి రాత పరీక్షలు రాయడానికి వారంతా బెంగళూరు చేరుకున్నారన్నారు.