ఆంధ్రప్రదేశ్‌

‘బుగ్గన’కు నేనంటే భయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 14: పిఎసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి తానంటే భయం పట్టుకున్నట్లుందని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి తనను విమర్శించే స్థాయి లేదన్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ నియోజకవర్గం నుంచే 5సార్లు, ఒకసారి పత్తికొండ నుంచి మొత్తం 6సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానన్నారు. తాను మళ్లీ ఎక్కడ డోన్ నుంచి పోటీ చేస్తానో అని, బుగ్గనకు నిద్రపట్టనట్టుగా ఉందన్నారు. తాను డోన్ నుంచి పోటీ చేసినా లేకపోయినా ఆయన మాత్రం వచ్చే ఎన్నికల తరువాత పేరుకు ముందు మాజీ ఎమ్మెల్యే అని పెట్టుకోవాల్సిందేనన్నారు. పిఎసి చైర్మన్‌గా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు సూచనలు చేయాల్సంది పోయి ముఖ్యమంత్రి చంద్రబాబుని, లోకేష్‌ని విమర్శించడమే బుగ్గన ఎజెండాగా పెట్టుకున్నారన్నారు. బహుశా పిఎసి చైర్మన్ ఇచ్చే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబుని విమర్శించడానికి ఆ పదవి ఉపయోగిస్తానని వైఎస్‌ఆర్ పార్టీ అధ్యక్షుడితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఉందని విమర్శించారు.