ఆంధ్రప్రదేశ్
ఏపికి ప్రాధాన్యం ఇవ్వండి!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 15 September 2017
విజయవాడ, సెప్టెంబర్ 14: రాష్ట్రంలో నెలకొన్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపి కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణ గురువారం కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్కుమార్ను కోరారు. నిరుద్యోగుల ఉపాధి కల్పనపై దృష్టి సారించాలని కోరుతూ రాష్ట్రంలో నెలకొన్న తన శాఖాపరమైన అంశాలను కేంద్రమంత్రికి వినతిపత్రం రూపంలో అందించారు. కొత్తగా కేంద్ర మంత్రి బాధ్యతలు స్వీకరించిన సంతోష్కుమార్ను గురువారం పితాని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. కొత్తగా ఏర్పడిన తమ రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న పితాని అభ్యర్థనపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.