ఆంధ్రప్రదేశ్‌

ఇసుక దోపిడీలో 30 మంది టిడిపి ఎమ్మెల్యేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 15: టిడిపి నేతలు మాఫియాగా ఏర్పడి ఇసుక, మట్టి దోపిడీలకు పాల్పడుతున్నారని, రాష్ట్రంలో 30 మంది టిడిపి ఎమ్మెల్యేల పాత్ర ఇందులో ఉందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. శుక్రవారం అరండల్‌పేటలోని ఓ హోటల్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం నేతల దోపిడీ విపరీతంగా పెరిగిపోయిందన్నారు. ఎపిలోని అన్ని నదుల నుంచి ఇసుక దోపిడీ పెద్ద ఎత్తున జరుగుతోందన్నారు. సాక్షాత్తు సిఎం ఇంటిపక్కనే ఇసుక దోపిడీ జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యారని విమర్శించారు. యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నా వీరిపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేవని దుయ్యబట్టారు. ఇసుక మీద వచ్చే ఆదాయంతో డ్వాక్రా మహిళలను లక్షాధికారుల ను చేస్తానని ప్రగల్బాలు పలికిన చంద్రబాబు ఇప్పుడేం చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. నదుల పరిరక్షణ గురించి చంద్రబాబు మాట్లాడటం మన దౌర్బాగ్యమని తెలిపారు. సాక్షాత్తు నదీగర్భంలో నిర్మించిన ఇంట్లోనే చంద్రబాబు ఉంటున్నారని, ర్యాలీ ఫర్ రివర్స్ పేరుతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారంటూ విమర్శించారు.