ఆంధ్రప్రదేశ్‌

ఏయూ అభివృద్ధికి సహకరించాలి: విసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 16: ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) అభివృద్ధికి పూర్వ విద్యార్థులు సహకరించాలని వైస్‌చాన్స్‌లర్ జి.నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం ఏపి భవన్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఢిల్లీ చాప్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ ఇప్పటివరకు ఏయూ అలూమ్ని గోదావరి జిల్లాల చాప్టర్, హైదరాబాద్ చాప్టర్, ఢిల్లీ చాప్టర్ ప్రారంభమయ్యాయని, పూర్వ విద్యార్థులు యూనివర్సిటీ అభివృద్ధికి సహకారం అందించాలన్నారు.అలూమ్ని ప్రధాన కార్యదర్శి మోహన్ వెంకటరామ్ మాట్లాడుతూ, ఏయూ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం డిసెంబరు 9న విశాఖలో నిర్వహించనున్నట్టు తెలిపారు. హడ్కో చైర్మన్ రవికాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.