ఆంధ్రప్రదేశ్‌

టిడిపిలోకి మాజీ సిఎం నల్లారి సోదరుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్రంకొండ, సెప్టెంబర్ 18: కార్యకర్తల అభీష్టం మేరకు టిడిపిలో చేరుతామని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమారరెడ్డి సోదరుడు కిశోర్‌కుమార్‌రెడ్డి అన్నారు. తమ కుటుంబం 30 సంవత్సరాలుగా రాజకీయాల్లోకి వచ్చి పార్టీకతీతంగా ప్రజా సేవ చేశామని అన్నారు. తండ్రి, తరువాత అన్న ముఖ్యమంత్రిగా ఎదిగి నియోజక వర్గానికి దాదాపు రూ.2000 కోట్లు అభివృద్ధి పనులు చేశారన్నారు. ప్రస్తుత ఎంపి, ఎమ్మెల్యే తమకు ఎలాంటి సహాయం చేయలేదని తన అనుయాయులు తన వద్ద వాపోయారన్నారు. మీరు ఏ పార్టీకి వెళ్లినా తాము మీవెంటే నడుస్తామని కార్యకర్తలు తనకు చెప్పారని కిషోర్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రతి పంచాయతీలోనూ కార్యకర్తలు అభిప్రాయం తెలిపితే తాము టిడిపి లో చేరడానికి సిద్ధంగా వున్నామని ఆయన తన అభిప్రాయపడ్డారు.