ఆంధ్రప్రదేశ్‌

భారీగా పెరిగిన శ్రీశైలం నీటిమట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, సెప్టెంబర్ 18: శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి సోమవారం కూడా వరద కొనసాగింది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా సోమవారం 854.50 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు కాగా ప్రస్తుతం 90.55 టిఎంసిల నీరు నిల్వ ఉంది. జూరాల నుండి 1,67,270 క్యూసెక్కులు, రోజా నుంచి 8,958 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,76,228 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి చేరుకుంది. 2,488 క్యూసెక్కల నీరు దిగువ నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.