ఆంధ్రప్రదేశ్‌

పాతాళగంగ వద్ద తల్లీబిడ్డల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, సెప్టెంబర్ 18: ఆర్థిక సమస్యలతో సతమతమైన ఓ తల్లి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతులను కర్నాటకకు చెందిన జగ్గదేవి (26), ఉషాబాయి (4), లక్ష్మి (2)గా గుర్తించారు. సోమవారం మృతదేహాలు నీళ్లలో తేలడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కర్నాటక రాష్ట్రం, బీదర్ జిల్లా, బసవకళ్యాణం తాలూకా కిరిడి గ్రామానికి చెందిన జగ్గదేవి తన ఇద్దరు కూతుళ్లు ఉషాబాయి, లక్ష్మితో కలిసి ఈ నెల 16వ తేదీ శ్రీశైలం చేరుకుంది. స్వామి దర్శనం అనంతరం అన్నదాన మందిరంలో భోజనం చేసింది. తమది చాలా పేద కుటుంబమని, పిల్లలను పోషించుకోవడం కష్టంగా ఉందని, ఎవరైనా ముందుకువస్తే పెంచుకునేందుకు ఇస్తానని అక్కడివారితో అన్నట్లు సమాచారం. అయితే ఎవరూ ముందుకు రాకపోవడం జీవితంపై విరక్తి చెంది పిల్లలతో కలిసి లింగాలగట్టు వద్ద పాతాళగంగలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అమరాబాద్ సిఐ రమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబ సమస్యల నేపధ్యంలో ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు.