ఆంధ్రప్రదేశ్
మహాదేవ శంభో..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 8 March 2016
శ్రీశైలం నుంచి కీసర వరకూ తెలుగు రాష్ట్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన సోమవారమే ఈ సారి శివరాత్రి కావడంతో శివాలయాలన్నీ భక్తుల తాకిడితో పోటెత్తాయి. పుణ్యస్నానాలాచరించి లక్షలాదిగా గుళ్లకు తరలివచ్చిన భక్తులు ‘శంభో శంకర..’అంటూ మహాశివుడ్ని పూజించారు. తెల్లవారుజాము నుంచీ కూడా అన్ని శివాలయాలకూ భక్తుల రాక మొదలైంది.వందలు, వేలు లక్షలుగా వీరి సంఖ్య పెరగడంతో పరమశివుడి దర్శనానికి గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సి వచ్చింది. భక్తి, సంప్రదాయం మేళవించిన రీతిలో అన్ని ఆలయాల్లోనూ దైవత్వం, దివ్యత్వం గోచరించింది.
చిత్రం...
శివరాత్రి పర్వదినాన శ్రీశైలంలోని ప్రభల ఉత్సవానికి పోటెత్తిన భక్తులు