ఆంధ్రప్రదేశ్‌

ఆరు నెలల్లో 20 లక్షల మరుగుదొడ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, అక్టోబర్ 11: రాష్ట్రంలో స్వచ్ఛ భార త్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద ఆరు మాసాల్లో 20 లక్షల మరుగుదొడ్లు నిర్మించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. స్వచ్ఛ ఆంధ్ర మిషన్ కింద రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు మిగతా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో యాంత్రిక విధానంలో రోడ్లు, డ్రైన్లు పరిశుభ్రం చేసేందుకు, గార్బేజీ తరలింపునకు సమకూర్చిన వివిధ వాహనాలకు బుధవారం వెలగపూడి సచివాలయం రెండవ బ్లాకు వద్ద సిఎం జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛ్భారత్ మిషన్‌లో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర మిషన్ కింద రాష్ట్రాన్ని పరిశుభ్రమైన, సుందర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్య లు తీసుకుంటున్నామన్నారు. ఈ లక్ష్య సాధనలో భాగంగానే ప్రత్యేకంగా ఎపి అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఉత్తమ విధానాలు అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా వచ్చే ఆరు మాసాల్లో గ్రామాలు, పట్టణాల్లో 20 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
అన్ని పట్టణాల్లోను రోడ్లు, డ్రైన్లను ఎప్పటికప్పుడు సకాలంలో పరిశుభ్రం చేయడం ద్వారా రాష్ట్రాన్ని అన్ని విధాలా సుందర రాష్ట్రంగా చేసేందుకు ఈ యంత్రాలను సమకూర్చుతున్నట్లు వెల్లడించారు. ఎపిఅర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లలో మూడు ట్రీ మెయినె్టనెన్స్ ప్లాట్‌ఫాం యంత్రాలను అందుబాటు లో ఉంచుతున్నామన్నారు. ఈ యంత్రాలు ఆయా నగరాల్లో రోడ్లకు, విద్యుత్ లైన్లకు ఆటంకంగా, వాహనాలు, పాదచారులకు ఇబ్బందిగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగిం చి వాటిని అర్బన్ ల్యాండ్‌స్కేపింగ్ విధానం కింద అం దంగా తీర్చిదిద్దేందుకు వినియోగిస్తామని చెప్పారు.
మున్సిపాలిటీలకు తరలిన వాహనాలు
రాష్ట్రంలోని అన్ని నగరాలు, మున్సిపాలిటీలో డ్రైన్లు, రోడ్లను యాంత్రిక విధానంలో క్లీన్ చేయడంతో పాటు వాటన్నిటినీ సుందరంగా తీర్చిదిద్దేందుకు వీలుగా వివిధ రకాల వాహనాలను సమకూర్చారు. వాటిలో ముఖ్యంగా గార్బేజీ తరలించేందుకు ఒక్కొక్కటి 16 లక్షల రూపాయల వ్యయం తో 6 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో కూడిన 330 ట్రక్ వౌంటెడ్ రెఫ్యూజ్ కాంపాక్టర్లు, 14 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం కలిగిన ఒక్కొక్కటి 26 లక్షల 50 వేలు రూపాయలు వ్యయం కల్గిన 140 ట్రక్ వౌంటెడ్ రెఫ్యూజ్ కాంపాక్టర్లు, ఒక్కొటి 14 లక్షల 30 వేలు విలువ గలిగిన 255 స్కిడ్ స్టీర్ లోడర్లు, ఒక్కొక్కటి 26 లక్షల 66 వేలు విలువ కలిగిన 150 కాంపాక్ట్ హెవీ డ్యూటీ రోడ్డు స్వీపింగ్ యంత్రాలు, ఒక్కొక్కటి 57 లక్షల 10 వేల వ్యయంతో కూడిన 15 ట్రక్ వౌంటెడ్ రోడ్ స్వీపింగ్ యంత్రాలను వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సరఫరా చేసే కార్యక్రమం చేపట్టగా విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థలకు అందించే వివిధ వాహనాలకు సిఎం జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల పలవన్, మున్సిపల్ పరిపాలనా శాఖ సంచాలకులు కన్నబాబు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ జె.నివాస్, స్వచ్ఛ ఆంధ్ర మిషన్ ఎండి మురళీధర్ రెడ్డి, స్వచ్ఛ ఆంధ్ర మిషన్ కార్పొరేన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సిఎల్ వెంకటరావు, గ్రీన్ బెల్ట్ కార్పొరేషన్ ఎండి చంద్రమోహన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.