ఆంధ్రప్రదేశ్‌

‘వల’సకు దూరంగా వైసీపీ ఎమ్మెల్యేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 30: మరో పదకొండు రోజుల్లో జరగనున్న రాజ్యసభ ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఇప్పటివరకూ జరిగిన చేదు అనుభవాలు దృష్టిలో ఉంచుకుని, తన పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ విసిరే వలలో పడకుండా, వారి ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టిడిపి నాలుగో అభ్యర్థిని రంగంలోకి దింపాలని యోచిస్తున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డిని గెలిపించుకోవడాన్ని జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలు టిడిపి నేతలకు దొరక్కుండా వారిని ఇప్పటికే రాష్ట్రం తరలించారు. 11వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అప్పటివరకూ తన పార్టీ ఎమ్మెల్యేలను అమెరికా, శ్రీలంక, దుబాయ్, ఊటీ, బెంగళూరుకు తరలించినట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల ముందు రోజు వరకూ వారిని అక్కడే ఉంచే ఏర్పాట్లు చేశారు. తన పార్టీకి చెందిన మరో 19 మంది ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న కసరత్తును దృష్టిలో ఉంచుకున్న జగన్, ముందు జాగ్రత్తగా తన ఎమ్మెల్యేలను సురక్షిత శిబిరాలకు తరలించారు. కొంతమంది టిడిపి ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారన్న విషయాన్ని, వైసీపీ ఎమ్మెల్యేలు చాలాకాలం నుంచి జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని, ముందు వారితో ఏకాంతంగా మాట్లాడి, మీ సమస్యలు పరిష్కరిస్తానని జగన్ హామీ ఇచ్చారు. దానితోపాటు, వారి ‘సమస్య’లను పరిష్కరించే బాధ్యతను రాజ్యసభ అభ్యర్ధి విజయసాయిరెడ్డికి అప్పగించారు. దాంతో విజయసాయిరెడ్డి.. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కరుణాకర్‌రెడ్డి వంటి సీనియర్లను వెంటబెట్టుకుని తన పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లకు స్వయంగా వెళ్లి వస్తున్నారు. అందులో భాగంగానే ప్రకాశం జిల్లాకు చెందిన మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఇంటికి వెళ్లి, ఆయన ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యను పరిష్కరించారు. ఈవిధంగా అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను గుర్తించి, వారి వద్దకు విజయసాయిని పంపించారు.
ఒకవేళ నామినేషన్ చివరిరోజు వరకూ, టిడిపి నాలుగవ అభ్యర్ధిని నిలబెట్టకపోతే ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. అప్పటివరకూ ఎమ్మెల్యేలను ‘క్యాంపు’లోనే ఉంచే ఏర్పాట్లు చేశారు. అయితే, కొందరు ఎమ్మెల్యేలు అంతకుముందే అమెరికా, దుబాయ్ వెళ్లారు. వారిలో కొందరు కుటుంబాలతో వెళ్లారు. మంగళవారం తర్వాత ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయాల కొనసాగింపుపై స్పష్టత వస్తుంది.
ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు 1న టిడిపిలోకి
ఇదిలాఉండగా, జగన్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రకాశం జిల్లాకు చెందిన గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే రామారావు 1న టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వారిద్దరూ దేశంలో చేరేందుకు మండల స్థాయిలో తన అనుచరులతో సమావేశమయ్యారు.