ఆంధ్రప్రదేశ్‌

రైతన్నలు, ప్రజలకు అండగా ఉంటా: జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, నవంబర్ 16: మీ సమస్యలు తీర్చేందుకు నేనున్నానని వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లాలో గురువారం ప్రజా సంకల్పయాత్ర 10వ రోజు ఆళ్లగడ్డ, దొర్నిపాడు మండలాల్లో కొనసాగింది. పాదయాత్రలో పలు సంఘాల ప్రతినిధులు జగన్‌ను కలిసి వినతిపత్రాలు అందజేశారు. పలువురు రైతులు జగన్‌ను కలిసి తెగుళ్లు సోకిన పంటలను చూపించి తమను ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. వైకాపా అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. అప్పుడే బడుగు, బలహీనవర్గాలు, పేదలు, మహిళలు సంతోషంగా ఉంటారన్నారు. గిట్టుబాటు ధర కావాలంటే వైకాపా అధికారంలోకి రావాలన్నారు. చంద్రబాబు ఏ ఒక్క హామీ నెరవేర్చడం లేదన్నారు. దీంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మాటమార్చిన ప్రభుత్వంతో విసిగిపోయారన్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి, యువ నాయకులు గంగుల బిజేంద్రారెడ్డి, గంగుల మనోహర్‌రెడ్డి, మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పలుచాని బాలిరెడ్డి, రంగేశ్వరరెడ్డి, సింగం భరత్ ఉన్నారు.

చిత్రం..రైతులతో మాట్లాడుతున్న జగన్