ఆంధ్రప్రదేశ్‌

పట్టిసీమలో 10 మోటార్లు నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, నవంబర్ 18: పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమ ఎత్తిపోతల పథకంలోని 10 మోటార్లను శనివారం నుండి నిలిపివేసి, మిగిలిన 14 మోటార్ల ద్వారా 4,900 క్యూసెక్కుల గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నారు. ఈ సీజన్లో గత జూన్ 19న ఎత్తిపోతలలోని 24 మోటార్లను ఆన్‌చేసి రోజుకు 8500 క్యూసెక్కుల నీటిని కృష్ణా డెల్టాకు తరలింపు ప్రారంభించారు. మధ్యలో భారీ వర్షాల కారణంగా ఏర్పడిన ఆటంకం వల్ల రెండురోజులు మోటార్లు నిలిపివేసి తిరిగి ప్రారంభించారు. గోదావరి నదిలో ఇన్‌ఫ్లో తగ్గడంతో పది మోటార్లను ఆపి రోజుకు 4,900 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. గోదావరి నీటి మట్టం 14 మీటర్లకు తగ్గితే మోటార్లు ఆపివేస్తారు. ప్రస్తుతం 14.10 మీటర్ల నీటి మట్టం ఉంది. ఈ నెలాఖరుకు మొత్తం మోటార్లను ఆపివేస్తారని అధికారులు తెలిపారు.