ఆంధ్రప్రదేశ్‌

మున్సిపల్ చైర్మన్‌పై దాడి కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట, నవంబర్ 19: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ ఇంటూరి రాజగోపాల్‌పై పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. పట్టణ పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. తాను ఆదివారం ఉదయం సామినేని ఉదయభాను ఇంటికి వెళుతుండగా ఎదురుగా వచ్చిన రాజగోపాల్ గత ఎన్నికల్లో సహకరించలేదంటూ తనపై దౌర్జన్యం చేసి కొట్టారని, తన కారులో నుండి కత్తి తీసి చంపబోయారని నంబూరి రవి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. కాగా, తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ అన్నారు. నంబూరి రవి అనే వ్యక్తి మున్సిపల్ పనులు చేయకపోయినా బిల్లులు మంజూరు చేయాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని, తాను అంగీకరించక పోవడంతో అక్రమ కేసు పెట్టి వేధించాలని చూస్తున్నారని ఆయనన్నారు. దీన్ని న్యాయపరంగా ఎదుర్కొంటానని, అయ్యప్పమాలలో ఉన్న తాను దౌర్జన్యం చేసినట్లు ఫిర్యాదు చేయటాన్ని ఆయన ఖండించారు.