ఆంధ్రప్రదేశ్
అది రాజకీయ నిర్ణయం: యనమల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 21 November 2017
విజయవాడ, నవంబర్ 20: శాసన మండలిలో ప్రశ్నలు వేసి గైర్హాజరైన వైకాపా ఎమ్మెల్సీలను పిలవాల్సిన అవసరం లేదని రాష్ట్ర లెజిస్లేటివ్ అఫైర్స్ శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభలో లేని సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నామని, వారికి ఒక సారి ఫోన్ చేసి ఆహ్వానించాల్సిందిగా మండలి చైర్మన్ ఫరూఖ్కు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సూచించారు. దీనిపై మంత్రి యనమల స్పందిస్తూ, ఆ సభ్యులు రాకపోవడంతో చైర్మన్కు సంబంధం లేదని, ఇది రాజకీయ నిర్ణయని స్పష్టం చేశారు. చైర్మన్ కూడా మాట్లాడుతూ ఇది రాజకీయ నిర్ణయమని, పిలవాల్సిన అవసరం లేదన్నారు.