ఆంధ్రప్రదేశ్‌

సైకోలా వ్యవహరిస్తున్న జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూన్ 6: వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సైకోలా వ్యవహరిస్తున్నారని మంత్రులు కామినేని శ్రీనివాస్, పల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు. తనస్థాయి మరిచి బాధ్యతాయుతమైన సిఎం పదవిలో ఉన్న చంద్రబాబునాయుడుపై అనుచితవ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం అనంతపురం నగరంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొట్టేలా చెప్పులు, చీపుళ్లు వంటి భాషను సిఎంపై వాడడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి వ్యక్తి ఏ పదవికీ అర్హుడు కాడన్నారు. రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చేందుకు జగన్ తన భరోసా యాత్రలను ఎంచుకున్నారన్నారు. ఐదు రోజులపాటు అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్రలే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రశాంతంగా ఉన్న అనంతపురం జిల్లాను అల్లకల్లోలం చేయాలనే ఆలోచనతోనే జగన్ యాత్ర చేపట్టారన్నారు. వైఎస్ హయాంలో రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం రెండోస్థానంలో ఉండగా, ప్రస్తుతం 16వ స్థానానికి పడిపోయిందన్నారు. ఇందుకు సిఎం చంద్రబాబునాయుడు చేపట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాలే కారణమన్నారు. పట్టిసీమ ద్వారా రాయలసీమ ప్రాంతానికి నీళ్లిచ్చి, కరవు రహిత ప్రాంతంగా మార్చాలని సిఎం ప్రయత్నిస్తుంటే, జగన్ సైంధవుడిలా అడ్డుపడుతున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.