ఆంధ్రప్రదేశ్‌

సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుపై ఎసిబి దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, జూన్ 6: అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం సాయంత్రం ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. అనధికారికంగా ఉన్న 2,95,250 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎసిబి డిఎస్పీ ఆర్‌విఎస్‌ఎన్ మూర్తి మాట్లాడుతూ మార్కాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై తమ కార్యాలయానికి అనేక ఫిర్యాదులు అందాయని, దీంతో దాడులు నిర్వహించామని తెలిపారు. రికార్డు గదిలో 2,71,100 రూపాయలు వివిధ ప్రాంతాల్లో దాచి ఉండడాన్ని గమనించి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇదే సమయంలో కార్యాలయంలో పనిచేస్తున్న చెన్నయ్య అనే వ్యక్తి వద్ద 24,150 వేల రూపాయలు స్వాధీనం చేసుకుని అతడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఎసిబి అధికారుల రాకను గమనించిన ఓ అధికారి తన జేబులో ఉన్న పదివేల రూపాయల కట్టను కిటికీలో నుండి బయటకు విసిరివేశారని తెలిపారు. ఇక్కడ ఇద్దరు రిజిస్ట్రార్లు ఉండగా గోపాల్ అనే రిజిస్ట్రార్ సెలవులో ఉండడంతో ఎల్ వెంకటేశ్వర్లు సీనియర్ అసిస్టెంట్ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని తెలిపారు.