ఆంధ్రప్రదేశ్‌

రాహుల్ ప్రధానైతే ‘హోదా’ ఫైలుపై తొలి సంతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ్యాణదుర్గం, డిసెంబర్ 10: కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు తప్పకుండా ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు. రఘువీరా ఆదివారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పర్యటించి ‘ఇందిరమ్మ రాజ్యం- ఇంటింటా సౌభాగ్యం’ గురించి ప్రజలకు తెలియజేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోళ్ల గ్రామంలో నిర్వహించిన బహిరంగ సమావేశంలో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌పార్టీని అధికారంలోకి తేవడంతో పాటు కేంద్రంలో కూడా జాతీయ పార్టీని బలోపేతం చేసి రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయితే తొలి సంతకం ఏపీ ప్రత్యేక హోదా ఫైలుపైనే చేస్తారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వానికి గడ్డుకాలం అతి త్వరలోనే ముంచుకొస్తుందన్నారు.

చిత్రం..గోళ్ల గ్రామంలో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తున్న పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి