ఆంధ్రప్రదేశ్‌

కదులుతున్న గూడ్సు రైలెక్కిన విద్యార్థి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 11: ప్రమాదవశాత్తూ విద్యుత్‌లైన్ తగలడంతో విద్యార్థికి గాయాలైన సంఘటన సోమవారం చిత్తూరు జిల్లా పుత్తూరులో జరిగింది. స్థానికుల కథనం మేరకు వివారాలు ఇలా ఉన్నాయి. మునిసిపల్ పరిధిలోని బత్తలవారి కండ్రిగలో నివాసం ఉంటున్న ఎస్.బాబు (17), స్థానిక ఎస్ ఆర్ ఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం సాయత్రం 4.20 గంటలకు పుత్తూరు రైల్వేస్టేషన్‌లో అప్పటికే నిలిచి ఉన్న గూడ్స్ బండిని ఎక్కాడు. ప్రమాదవశాత్తూ హైటెన్షన్ లైన్లు తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. గాయపడ్డ బాబును రైల్వే సిబ్బంది గుర్తించి ప్లాట్‌ఫాంపైకి తీసుకొచ్చాడు. అప్పటికే శరీరం పూర్తిగా కాలిపోవడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యంకోసం రుయాకు తరలించారు. కాగా బాబు గూడ్స్‌పైకి ఎందుకు ఎక్కాడో అన్న విషయం తెలియాల్సి ఉంది.