ఆంధ్రప్రదేశ్‌

సూది మొనకే సై?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 13: రెండేళ్లనుంచి పరిశీలన, పరిశోధన, సమీక్ష, పర్యటనలకే పరిమితమైన అమరావతి నగర నిర్మాణ ఆకృతులకు మోక్షం లభించనుంది. కీలకమైన అసెంబ్లీ భవన నిర్మాణ ఆకృతి ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. అసెంబ్లీ, పరిపాలనా భవనాలకు సంబంధించిన డిజైన్లను నార్మన్ ఫోస్టర్ బృందం ప్రభుత్వం ముందుంచింది. వాటికి దర్శక దిగ్గజం రాజవౌళి కొన్ని మార్పు చేర్పులు సూచిస్తూ, తనదైన శైలిలో రెండు డిజైన్లను సమావేశంలో ప్రదర్శించారు. చివరకు అందులో నార్మన్ ఫోస్టర్ అసెంబ్లీ నిర్మాణం కోసం రూపొందించిన సూది మొన ఆకారంలోని టవర్ డిజైన్ వైపే ఎక్కువమంది మొగ్గు చూపారు. సీఎం చంద్రబాబు కూడా దానిపైనే ఆసక్తి చూపడంతో ఆ డిజైనే ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటిని గురువారం నుంచి రెండురోజుల పాటు జరిగే వర్క్‌షాపులో ప్రదర్శించి, ప్రజాభిప్రాయం మేరకు అధికారికంగా ఖరారు చేయనున్నారు.
శాసనసభ భవంతి తుది ఆకృతి ఎంపికలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర శాసనసభ భవంతి కోసం నార్మన్ ఫోస్టర్ బృందం తాజాగా రూపొందించిన రెండు డిజైన్లపై బుధవారం సచివాలయంలో సవివర చర్చ జరిపిన అనంతరం ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. సీఎం అధ్యక్షతన జరిగిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ 13వ సమావేశంలో ఫోస్టర్ ఆకృతులపైనే ప్రధానంగా చర్చ జరిగింది.
సమావేశంలో అత్యధికులు సూది మొన ఆకృతిలోని టవర్ డిజైన్‌కే మొగ్గు చూపారు. సీఎం చంద్రబాబు ఇటీవలి లండన్ పర్యటనలో ఫోస్టర్ బృందం జరిపిన వర్క్‌షాప్‌లో పాల్గొని తన అభిప్రాయాలు వ్యక్తీకరించారు. మన సంస్కృతి, వారసత్వాలకు అద్దంపడుతూనే మరింత సృజనాత్మకంగా, వైవిధ్యంగా ఆకృతులు ఉండాలని సూచించారు. దరిమిలా గతంలో ఫోస్టర్ బృందం రూపొందించిన పలు ఆకృతులను పబ్లిక్ డొమైన్‌లో ఉంచి, సీఆర్‌డీఏ ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ఆ విధంగా అత్యధిక ప్రజానీకం ఎంపిక చేసిన ఆకృతులకు, సీఎం సూచనల ప్రకారం మార్పులను జోడించి ఫోస్టర్ బృందం సరికొత్త ఆకృతులను రూపొందించింది. హైకోర్టు కోసం గతంలో ప్రతిపాదించిన బౌద్ధ స్థూపాకారపు ఆకృతిని మరింత ఆకర్షణీయంగా మలచి, ఫోస్టర్ ప్రతినిధులు తాజా సమావేశంలో ప్రదర్శించారు. అంతర్గత నిర్మాణాలు, అంతస్తుల ప్రణాళికలను వివరించారు.
శాసనసభ భవంతి కోసం రూపొందించిన రెండు ఆకృతులను సమావేశంలో ప్రదర్శించారు. సూది మొన కలిగిన టవర్ రూపంలో ఒకటి, చతురస్రంగా ఉన్న మరో ఆకృతిపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అత్యధికులు, టవర్ బిల్డింగ్ వైపే మొగ్గు చూపారు. ఈ రెండు ఆకృతులను వెంటనే సీఆర్‌డీఏ పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంచి, ప్రజానీకం అభిప్రాయాన్ని సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. గురువారం మరోమారు ఫోస్టర్ బృందంతో సమావేశమై చర్చిద్దామని నిర్ణయించారు. నిర్మాణ, భద్రతాపరమైన అంశాలన్నింటినీ పరిశీలించి ప్రజాభిప్రాయం ప్రకారం తుది ఎంపిక చేద్దామని చెప్పారు. అత్యధికులకు నచ్చిన టవర్ డిజైన్ భవంతిలో కింది భాగంలో శాసనసభ ఉంటుంది. పైన ప్రజలు సందర్శన నిమిత్తం పొడవైన వ్యూయింగ్ టవర్ నిర్మిస్తారు. ఈ తరహా నిర్మాణం ప్రపంచంలోనే వైవిధ్యమైనదని ఫోస్టర్ బృందం పేర్కొంది.
టవర్ ఆకృతితోపాటు భవంతి బాహ్య కుఢ్యాలపై సినీ దర్శకుడు రాజవౌళి అందించిన త్రీ డైమన్షనల్ చిత్రాలతో కూడిన చతురస్రాకారపు రెండో ఆకృతిని కూడా సీఆర్‌డీఏ పబ్లిక్ డొమైన్‌లో ఉంచుతారు. రెండింటిలో అత్యధిక ప్రజలు ఎంపిక చేసిన వాటిని తుది డిజైన్‌గా తీసుకుంటారు. సూర్యుడు ఉదయించే రాష్ట్రం కనుక సూర్యుడి ఇమేజ్, పురాతన నాణేలు, రాచరిక చిహ్నాలు, పూర్ణకుంబం, నెమలి ఈక వంటి చిత్రాలను పరిశోధించి ఫోస్టర్ బృందానికి అందించామని రాజవౌళి తెలిపారు.
ఈ డిజైన్లతోపాటు పరిపాలన నగరం బృహత్ ప్రణాళికలో చేసిన కొన్ని మార్పులపై సమావేశంలో ఫోస్టర్ బృందం ప్రెజెంటేషన్ ఇచ్చింది. జల వనరులు, పచ్చదనం, నిర్మాణాలకు మధ్య ప్రతిపాదించిన ఖాళీ స్థలం తదితర అంశాల్లో ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా మార్పు చేర్పులు చేసి, మెరుగైన బృహత్ ప్రణాళికను రూపొందించామని చెప్పారు.
అమరావతి నిర్మాణంపై నిపుణులతోవిజయవాడలో గురువారం నుంచి రెండు రోజుల వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్టు సీఆర్‌డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్ సమావేశంలో చెప్పారు. వర్క్‌షాప్‌లో 15 బృందాలతో వివిధ అంశాలపై గోష్టులు నిర్వహిస్తున్నామన్నారు. వౌలిక సదుపాయాలు, నాలెడ్జ్ ఎకానమీ, నిర్మాణ రీతులు, రవాణా వ్యవస్థ, ఉద్యోగాల కల్పన, సుస్థిర ఆర్థికాభివృద్ధి వంటి అంశాలతో పాటు నవ నగరాల నిర్మాణంపై బృంద చర్చలు సాగుతాయని తెలిపారు. స్థానికంగా వుండే ఆర్కిటెక్టులు, ప్రొఫెసర్లు, ప్రముఖులను ఈ కార్యగోష్టిలో భాగస్వాముల్ని చేయాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. సమావేశంలో మంత్రి పి.నారాయణ, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర, సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ పాల్గొన్నారు.