ఆంధ్రప్రదేశ్‌

నేడు టెట్ నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షెడ్యూల్ ప్రకటించిన మంత్రి గంటా పాసైనవారికి ఏడేళ్ల వరకు అర్హత
దరఖాస్తుల స్వీకరణకు జనవరి 1 గడువు జనవరి 17 నుంచి 27 వరకు పరీక్షలు
ఫిబ్రవరి 8న ఫలితాల ప్రకటన పేపర్ 1కు డీఎడ్ అభ్యర్థులే అర్హులు
పేపర్ 2కు బీఈడీ అర్హత భర్తీ బాధ్యత ఏపీపీఎస్సీకి అప్పగించే యోచన
నారాయణకు రూ 50 లక్షల జరిమానా విద్యార్థి ఆత్మహత్యపై విచారణకు ఆదేశం

విజయవాడ, డిసెంబర్ 1: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నోటిఫికేషన్ నేడు (డిసెంబర్ 14) విడుదల చేస్తున్నట్లు విద్యా మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. వెలగపూడి సచివాలయం 4వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన ఛాంబర్‌లో బుధవారం ఉదయం మీడియా సమావేశంలో టెట్ వివరాలు వెల్లడించారు. టెట్ ఫీజు చెల్లింపునకు గడువు ఈనెల 18 నుంచి 30 ఉంటుందన్నారు.
ఆన్‌లైన్ ద్వారా 18నుంచి జనవరి 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, 19 నుంచి 31 వరకు పనివేళల్లో హెల్ప్ డెస్క్ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. దరఖాస్తులు, ఇతర అంశాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు ఈనెల 19 నుంచి 30 వరకు స్వీకరిస్తారన్నారు. జనవరి 8 నుంచి ఆన్‌లైన్‌లో మాక్ టెస్ట్ అందుబాటులో ఉంటుందన్నారు. జనవరి 9 నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పరీక్షలు జనవరి 17 నుంచి 27 వరకు రెండు పేపర్లుగా ఉంటాయన్నారు. 1వ పేపర్ 1 నుంచి 5వ తరగతి ఉపాధ్యాయులకు మాత్రమేనని, వాటికి డీఎడ్ వారు మాత్రమే అర్హులన్నారు. మరో పేపర్ 6 నుంచి 10వ తరగతి వరకు అని, వాటికి బీఈడీ అభ్యర్థులు అర్హులన్నారు. పేపర్ వన్‌కు ఇంటర్‌లో 50 శాతం మార్కులు పొందిన వారు అర్హులని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కు లు ఉంటే సరిపోతుందని తెలిపారు. మొదటి సెషన్ ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతుందని వివరించారు. జనవరి 29న కీ విడుదల చేస్తామన్నారు. కీపై అభ్యంతరాలను జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు తెలుపవచ్చన్నారు. ఫిబ్రవరి 6న తుది కీ విడుదల చేస్తారని చెప్పారు. ఫిబ్రవరి 8న ఫైనల్ ఫలితాలు ప్రకటిస్తారని మంత్రి తెలిపారు. ఒకసారి టెట్ అర్హత సాధిస్తే ఏడేళ్ల వరకు అవకాశం ఉంటుందన్నారు.
పోస్టుల భర్తీ బాధ్యత ఏపీపీఎస్సీకే..?
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ బాధ్యత పోటీ పరీక్షల నిర్వహణలో దీర్ఘకాల అనుభవం కలిగిన ఏపీపీఎస్సీకి అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి గంటా తెలిపారు. గతంలో వీటిని ఎటువంటి అవకతవకలు లేకుండా డీఎస్సీ (డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ) ద్వారా భర్తీ చేశారని చెప్పారు. అయితే ఏపీపీఎస్సీకి వృత్తిపరమైన నిపుణులు అందుబాటులో ఉంటారని, అలాగే వారికి అనుభవం కూడా ఎక్కువేనని అందువల్ల వారికి అప్పగించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అయితే జూన్ నాటికి పోస్టులు భర్తీ చేయవలసి ఉన్నందున, సాధ్యాసాధ్యాలను పరిశీలించవలసి ఉందని, అందువల్ల ఏపీపీఎస్సీ చైర్మన్‌ని రమ్మనమని చెప్పామని , ఆయనతోనూ, సీఎంతోనూ మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఈ నెల 16,17,18 తేదీల్లో విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయిలో టెక్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌కు మలేషియా, నేపాల్, యూఏఈ విద్యాశాఖ మంత్రులతో పాటు విదేశీ ప్రతినిధులు 200 మంది వరకు, మన రాష్ట్రం, ఇతర రాష్ట్రాల నుంచి 800 మంది మొత్తం వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. విద్యా, సాంకేతిక రంగాలకు చెందిన నిపుణులు పాల్గొంటారని తెలిపారు.
విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అన్నారు. తిరుపతి నారాయణ జూనియర్ కాలేజీలో బి.కొత్తకోటకు చెందిన ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని, ఆ ఘటనపై విచారణకు ఆదేశించామని మంత్రి చెప్పారు. ఆ కాలేజీకి రూ.50 లక్షల రూపాయల జరిమానా విధించినట్లు తెలిపారు. గతంలో కూడా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలకు సంబంధించి నారాయణ, శ్రీ చైతన్య, సీవీ రామన్ వంటి కాలేజీలపై పెనాల్టీ విధించినట్లు చెప్పారు. అయితే ఆ పెనాల్టీ చెల్లించలేదని తెలిసిందని, అటువంటి కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు. పెనాల్టీ ద్వారా వసూలు చేసే సొమ్ములో కొంత భాగాన్ని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబానికి చెల్లించే అంశం పరిశీలిస్తామని చెప్పారు.