ఆంధ్రప్రదేశ్‌

శిరోముండనం కేసు 27కు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 14: తూర్పు గోదావరి జిల్లా వెంకటాయపాలెంలో 1997లో జరిగిన శిరోముండనం కేసుపై గురువారం తీర్పు వెలువడాల్సి ఉండగా తీర్పుపై హైకోర్టు స్టే ఇవ్వడంతో విశాఖ కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసు తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా పడింది. విశాఖలోని ఎస్సీ,ఎస్టీ న్యాయ స్థానం విచారిస్తోంది. ఈ కేసులో తమను ఎస్టీలుగా కుల ధృవీకరణ పత్రాన్ని న్యాయస్థానంలో సాక్ష్యంగా చూపలేదంటూ బాధితులు హైకోర్టును ఆశ్రయించడంతో జస్టిస్ ఎస్‌వీ భట్ ఈ కేసు తీర్పుపై స్టే ఇచ్చారు. హైకోర్టు ఉత్తర్వులను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వై.సుజాత ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానంలో దాఖలు చేశారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు వాయిదా వేస్తూ ఎస్సీ,ఎస్టీ కోర్టు న్యాయమూర్తి ఓ.వెంకటనాగేశ్వరరావు చెప్పారు.
చేశారు. ఈ కేసులో రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.